నేపాల్ నుండి తిరిగొచ్చింది వీరే..

రంగారెడ్డి : నేపాల్ నుండి సురక్షితంగా ఢిల్లీకి 8మంది తెలుగు యాత్రికులు ఆదివారం సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వీరికి స్వాగతం పలికారు. రావిరెడ్డి, కాశీ అన్నపూర్ణ, వెంకట్ రెడ్డి, వరలక్ష్మి, కామేశ్వరరావు, కుమారి, గణేష్, సత్యనారాయణలున్నారు.