పంచాయితీ ఎన్నికల్లో సత్తా చాటుదాం

భద్రాద్రి కొత్తగూడెం,మే15(జ‌నం సాక్షి): రాబోయే పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ సత్తా నిరూపించాలని ఆపార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య అన్నారు. పంచాయితీ ఎన్నికల్లో సత్తాచాటి టిడిపి బలపడాలన్నారు. అశ్వాపురంలో జరిగిన టీడీపీ మండల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీకి కార్యకర్తలే కొండంత అండ అన్నారు. వారి శ్రమతో పదవులు పొందిన కొందరు టీడీపీని వీడుతున్నారని విమర్శించారు. కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా పార్టీ ఆదుకుంటుందని, ఎవ్వరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు తుళ్లూరి ప్రకాశ్‌, తెలుగు మహిళా అధ్యక్షురాలు చంద్రకళ, వైస్‌ ఎంపీపీ బూతం వెంకటేశ్వర్లు, సదర్‌లాల్‌, మిట్టగూడెం సర్పంచ్‌ దుర్గారావు పాల్గొన్నారు.