పంచాయితీ కార్యదర్శుల జాబితా సిద్దం
హైదరాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): నాన్ లోకల్, లోకల్ బాధిత పంచాయతీ కార్యదర్శులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిని కలిశారు. తాము ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన దరఖాస్తు చేసుకుని పోస్టుకు ఎంపికయ్యామని, తమ సర్టిఫికెట్లు పరిశీలించి మూడేళ్ల బాండ్ కూడా తీసుకున్నారని బాధిత అభ్యర్థులు ఉన్నతాధికారులకు వివరించారు. కానీ ఇప్పుడు కొత్త జిల్లాల ప్రాతిపదికన నాన్ లోకల్ అంటూ పోస్టింగ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపడతామని నోటిఫికేషన్కు ఒక్కరోజు ముందు 124 జీవో ఇచ్చిన విషయం తమకు తెలియదన్నారు. ఈ ఒక్కసారి ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన అవకాశం ఇవ్వాలని అధికారులను బాధితులు కోరారు.