పందుల స్వైర విహారం

మహబూబ్‌నగర్‌,ఏప్రిల్‌25 : మహబూబ్‌నగర్‌తోపాటు జిల్లా అంతటా పందుల స్వైరవిహారం విపరీతంగా ఉంది. పాలమూరు మున్సిపాల్టీలో అపరిశుభ్ర వాతావరణం తాండవిస్తోంది. పందులు సంచారంపై చర్యలు తీసుకోవడం లేదు. పెంపకందారులు వాటిని ఒక్కచోట కట్టడి చేసిన దాఖలాలూ లేవు. సారిశుద్ద్య లోపంకారణంగానే వ్యాధులు ప్రబలుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.రద్దీ ప్రాంతాలు, కూడళ్లలో ప్రత్యేకశిబిరాలు నిర్వహించడం, గ్రామాల్లో దండోరాలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అప్రమత్తం అయ్యే అవకాశం ఉంది.