పట్టపగలే రాజధానిలో బ్యాంక్ దోపిడీ
క్యాషియర్ కాల్చివేత
న్యూఢిల్లీ,అక్టోబర్13(జనంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే బ్యాంకులోకి చొరబడిన దొంగలు.. మారణాయుధాలతో బెదిరించి నగదును దోచుకెళ్లారు. ఈ సంఘటన ఢిల్లీ ఖైరాలోని కార్పొరేషన్ బ్యాంకులో శుక్రవారం చోటు చేసుకుంది. అయితే బ్యాంకులోకి ప్రవేశించిన దొంగలు.. అక్కడున్న కస్టమర్లు, సిబ్బందిని తుపాకులు, కత్తులతో బెదిరించారు. ఆ తర్వాత క్యాషియర్ను తుపాకీతో కాల్చిచంపారు. ఇక ముఖాలకు ముసుగులు ధరించిన దొంగలు.. దొరికినంత నగదును దోచుకెళ్లారు. ఈ తతంగమంతా అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైంది. ఈ దోపిడీపై బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.