పట్టాలపై పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మేడ్చల్‌,జూన్‌5(జనం సాక్షి): ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండకి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి బైరు వాసుదేవరెడ్డి(38 రైల్‌ పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దిల్‌సుక్‌ నగర్‌ కొత్తపేటలో ఉంటున్నాడని గుర్తించారు. ఆత్మహత్యకి ఫిక్స్‌ అయిన వాసుదేవరెడ్డి ముందస్తుగా తన సోదరుడికి అమ్మ, నాన్న, లను నీవే మాంచిగా చూసుకోవాలని, ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్లో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్‌ పంపాడు. వాసుదేవరెడ్డి కోసం వారు వెతికే లోపే రైలు క్రింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సంఘటన స్థలానికి చేసురుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో బంధువుఉల కన్నీరుమున్నీరయ్యారు. కారణాలు తెలియాల్సి ఉంది.