పత్తిరైతు ఆత్మహత్య
జయశంకర్ భూపాలపల్లి,ఫిబ్రవరి8(జనంసాక్షి): మహాముత్తారం మండలం గాజరాంపల్లికి చెందిన గుంటి సతీష్(26)అనే పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సతీష్ తనకున్న మూడెకరాల భూమిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే పత్తి పంట దిగుబడి తక్కువగా వచ్చింది. దీంతో పత్తి సాగు కోసం చేసిన రూ.2లక్షల అప్పును తీర్చే మార్గం కనిపించలేదు. ఈ క్రమంలో సతీష్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. శవపరీక్ష కోసం సతీష్ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సతీష్ సోదరి సమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. సమ్మక్క ఫిర్యాదుపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.