పరస్పర దాడుల కేసులో 11మంది అరెస్ట్‌

రంగారెడ్డి,జూలై17(జ‌నం సాక్షి): పరస్పర దాడుల కేసులలో 11మంది నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు షాద్‌నగర్‌ రూరల్‌ సీఐ మధుసూదన్‌ తెలిపారు. మండల కేంద్రానికి చెందిన తుప్పర రవీందర్‌ అతడి అనుచరులు, కర్రోళ్ల వినోద్‌కుమార్‌ అతడి అనుచరులు తరుచూ ఘర్షణ పడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం రాత్రి రవీందర్‌ అతడి అనుచరులు, వినోద్‌కుమార్‌ అతడి అనుచరులు ఘర్షణకు దిగి పరస్పరం దాడులకు దిగారని పేర్కొన్నారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు 11మందిపై కేసు నమోదు చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తిరిగి ఘర్షణలకు పాల్పడితే రౌడిషీట్‌, పీడీయాక్ట్‌ పెడుతామని హెచ్చరించారు. సమావేశంలో ఎస్‌ఐ శ్రీశైలం, పోలీస్‌ సిబ్బంది ఉన్నారు.