పర్యాటకంగా నిజాంసాగర్ ప్రాజెక్టు : హరీష్‌రావు

నిజామాబాద్ : నిజాంసాగర్ ప్రాజెక్టును నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. సింగీతం జలాశయం పునరుద్ధరణకు రూ. 1.50 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గంలో గోదాముల నిర్మాణాలకు రూ. 10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. మిషన్ కాకతీయలో రైతులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.