పశువులపైకి దూసుకెళ్లిన లారీ: పలు పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి):  జిల్లాలోని ములకలపల్లిలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లారీ.. రోడ్డుపై వెళ్తున్న పశువులపై దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పలు పశువులు మృతి చెందాయి. మృతి చెందిన పశువుల వద్దకు వచ్చిన మిగతా పశువులు రోదిస్తున్నాయి. ఏం చేయాలో తోచక ఆ మూగ జీవాలు తల్లడిల్లుతున్నాయి. ఈ ఘటనతో పశువుల యజమాని తీవ్ర దిగ్భాంతికి గురయ్యాడు. వాటిని చూసి లబోదిబోమంటూ రోదించాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.