పాఠశాలకు సౌండ్ మైక్ అందజేసిన కొండమల్లేపల్లి ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి

 

 

 

 

 

కొండమల్లేపల్లి ఫిబ్రవరి 1 (జనంసాక్షి) న్యూస్ :
కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని కేజిబివి పాఠశాల విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాల నిమిత్తం సౌండ్ మైకు బుధవారం ఎంపిపి దూదిపాల రేఖ మండల అభివృద్ధి ప్రధాత దూదిపాల శ్రీధర్ రెడ్డితో కలిసి ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిపి దూదిపాల రేఖ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధులు చదువుతో పాటు సాంస్కృతిక, క్రీడా రంగాలలో కూడా రాణించాలని అన్నారు. పాఠశాలలో విద్యార్ధులకు మెను ప్రకారం ఆహారం అందజేస్తున్నారా అని విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్ధులు అవసరాల పాఠశాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కాసర్ల వెంకటేశ్వర్లు, అంగన్వాడీ సూపర్వైజర్ తిప్పర్తి రాధ, ఉపాధ్యాయులు స్వప్న, విమల, కమల, సిఏపల్లి ఉప సర్పంచ్ మూడావత్ మంగ్యానాయక్, రమావత్ సేవానాయక్, అంజి, నాగేంద్ర, రవి, శ్రీను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.