పాముకాటుతో బాలుడి మృతి

మహబూబ్‌నగర్, ఆగస్టు29: అచ్చంపేట మండలం పులిజాలలో ఘోరం జరిగింది. పాముకాటుతో సాయికుమార్‌ (8) అనే బాలుడు మృతి చెందాడు. ఇంటి ఆవరణలో ఆడుకుంటూ పాము కాటుకు గురయ్యాడు. సాయికుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఒక్కగానొక్క కుమారుడు ఇలా మృతి చెందడంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.