పారదర్శకంగా జడ్పి నిధుల కేటాయింపు.

జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి.
తాండూరు డిసెంబర్ 2(జనంసాక్షి)జిల్లా పరిషత్ నిధుల్లో అన్ని మండలాలకు పారదర్శకంగా నిధుల కేటాయింపు జరిగిందని జడ్పి చైర్ పర్సన్ సునీతారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం  జరిగిన జడ్పి సమావేశంలో మంత్రి సబితారెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఒకరిద్దరు సభ్యులు చేసిన ఆరోపణలపై సమాధానం ఇచ్చారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ నుంచి రెండోసారి చైర్ పర్సన్ గా ఉన్నప్పుడు వికారాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించా మన్నారు. ఈ సారి కూడా వికారాబాద్ జిల్లాలో వెనకబడిన మండలాలకు కొంత ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించిన మాట వాస్తవమన్నారు. తనకు జడ్పిటీసీలు అందరూ సమానమేనని చెప్పారు. జిల్లా అభివృద్ధిలో జడ్పి కీలక బాధ్యత పోషిస్తుందని అన్నారు.  అంతకు ముందు మంత్రితో కలిసి హెల్త్ కిల్లను  ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్, పరిగి, చేవెళ్ల  ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ లు, జడ్పిటీలు,  ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.