పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు

-కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గోండ(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతానని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు కాంగ్రెస్‌ గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తానన్నారు. పార్టీ మారుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీలో చేరుతున్నానంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని కోమటిరెడ్డ అన్నారు.