పార్లమెంటులో టీఆర్‌ఎస్‌ ఎంపీలది శిఖండి పాత్ర

– మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌
హైదరాబాద్‌, జులై20(జ‌నం సాక్షి) : టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో శిఖండి పాత్ర పోషిస్తున్నారని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ విమర్శించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేతకాని వాళ్ళలా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఏపీ ఎంపీలు ప్రత్యేక ¬దా కోసం పోరాడుతుంటే…టీఆర్‌ఎస్‌ ఎంపీలు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. విభజన హావిూలపై నాలుగేళ్లుగా టీఆర్‌ఎస్‌ మౌనం ఎందుకని ఆయన ప్రశ్నించారు. సీబీఐ కేసు ఉందని కేసీఆర్‌ భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. మోదీతో సీఎం కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. విభజన హావిూల అమలు కోసం పార్లమెంట్‌ ఎదుట నిరసన తెలుపుతామని పొన్నం ప్రభాకర్‌ అన్నారు.
——————-