పాలకుర్తిని మరింత అభివృద్ది చేస్తా: ఎర్రబెల్లి

జనగామ,అక్టోబర్‌ (జ‌నంసాక్షి): పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కష్టపడుతున్నానని మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగించారని అన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణకు చేసింది శూన్యమని అన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ పల్లెలు అభివృద్ధి చెందాయని  అన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే పార్టీ గెలుపునకు దోహదపడుతాయని పేర్కొన్నారు. అదేవిధంగా ప్రభుత్వం పేదలకోసం అమలు పర్చిన బతుకమ్మచీరలు, రైతుబంధు పథకం పై మహాకుటమి నాయకులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని అన్నారు. అయినా రైతుబంధు పథకాన్ని అపలేదని ఈ సందర్భంగా గుర్తుచేశారు. గ్రామాలకు సాగునీరు అందేవిధంగా ఎన్యానాయక్‌తండా వద్ద దేవాదుల రిజర్వాయర్‌ నిర్మించి సాగునీటి కష్టాలు తీరుస్తానని గ్రామస్తులకు హావిూ ఇచ్చారు.