పాలమూరులో 14 సీట్లను గెలుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ పాలన రావాలని కోరుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. 2014 ఎన్నికలు ముందు ఓట్ల కోసం గట్టు పథకానికి శంకుస్థాపన చేశామని గుర్తు చేశారు. పారదర్శకంగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు జరుగుతాయని పెర్కొన్నారు. సెక్రటేరియట్‌లో పైరవీకారులకు అవకాశం లేకుండా చేశామన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌లోకి పలువురు చేరుతున్నారని అన్నారు. సీమాంధ్ర పాలకులతో కొట్లాడి సాధించుకున్న తెలంగాణను ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధిని చూసే టీఆర్‌ఎస్‌ పార్టీలోకి చేరికలు ముమ్మరంగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చే సంకల్పంతో వివిధ పార్టీల నుంచి చాలా మంది చేరుతున్నారన్నారు.