పాల్వంచలో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు

భద్రాద్రి కొత్తగూడెం,జనవరి23(జ‌నంసాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో స్వాతంత్య సమర యోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 122వ జయంతి వేడుకలు నేతాజీ యువజనసంఘం ఆధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు ఎస్‌జేకే అహ్మద్‌ మాట్లాడుతూ.. నేటి యువత నేతాజీని స్పూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. స్వాతంత్య సంగ్రామంలో సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన త్యాగాలు, సేవలు మరువలేనివని కొనియాడారు. నేతాజీ జన్మదిన వేడుకల్లో భాగంగా స్దానిక స్టార్‌ చిల్‌రన్‌ స్కూల్‌లో బోస్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవీ రాఘవులు, స్టాలిన్‌, సాదత్‌ అలీ, ఒసామా సాధిక్‌, పి. ప్రసాద్‌, ఎం.సంతోష్‌, డాక్టర్‌ నామా బుచ్చయ్య, డాక్టర్‌ సోమరాజు దొర, డాక్టర్‌ ముక్తంటేశ్వరావు తదిదరులు పాల్గొన్నారు.