పిడుగుపాటుకు దంపతుల మృతి

భద్రాద్రి కొత్తగూడెం,సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి): పినపాక మండలంలోని జానంపేట గ్రామంలో విషాదం నెలకొంది. పిడుగుపాటుకు భార్యాభర్తలిద్దరూ మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకోగా ఇవాళ ఉదయం వెలుగు చూసింది. మృతులను బిజ్జా సుదర్శన్‌(35), రాంబాయి(31)గా గుర్తించారు. పోడు భూమిలో సాగు చేస్తుండగా పిడుగుపాటుకు వీరిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.