పిల్లలకు పచ్చదనంపై అవగాహన కలిగించాలి: గవర్నర్‌

హైదరాబాద్‌,నవంబర్‌14(జ‌నంసాక్షి):ప్రతి విద్యార్థికి పరిశుభ్రత, పచ్చదనంపై అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ తెలిపారు. రాజ్‌ భవన్‌ సంస్కృతి కల్చరల్‌ సెంటర్‌ లో జరిగిన బాలల దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. వివిధ పాఠశాలలకు చెందిన చిన్నారులకు గవర్నర్‌ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పాఠశాలలో చిన్నారులకు వ్యక్తిత్వం, సమాజం, మంచి అలవాట్లు వంటి మోరల్‌ క్లాసులు నిర్వహించాలని సూచించారు. అనంతరం మహత్మాగాంధీ డిజిటల్‌ మ్యూజియం ఏర్పాటు చేసిన ఎగ్జిబీషన్‌ ను గవర్నర్‌ నరసింహన్‌ పరిశీలించారు.