పిల్లలు కలగలేదని దంపతుల ఆత్మహత్య

p0loyoeuరంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివాహమై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదనే మనో వేదనతో చంద్రశేఖర్, చందన అనే దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకుని ప్రాణాలు వదిలారు. తమ మరణానికి ఎవరూ కారణం కాదంటూ సూసైడ్ నోట్ రాశారు. తమ మృతదేహాలను పోస్టుమార్టం చేయకూడదని నోట్లో విజ్ఙప్తి చేశారు.