పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌

జగిత్యాల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8,370 గృహాలు మంజూరు కాగా నేటి వరకు 51 9 గృహాలు పూర్తయ్యాయనీ, 871గృహాలు పునాదిస్థాయి నుంచి ఎ/-లాస్టింగ్‌ స్థాయి వరకు ఉన్నా య న్నారు. ఇండ్ల నిర్మాణాలపై ఏఈ నుంచి ఈఈ వరకు
ప్రత్యేక శ్రద్ద చూపాలన్నారు. కాంట్రాక్టర్లు పనులను పూర్తి చేయకుండా మరో శాఖ వారి ప నులు చేస్తే వారిని బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. ఏ ప్రిల్‌ నెలాఖరు వరకు పీఆర్‌ 370, ఆర్‌అండ్‌బీ 100, ఎస్సారెస్పీ 60, ఇరిగేషన్‌ 30, మొత్తం 5 60 ఇండ్ల పనులను పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లు పనులను త్వరగా నాణ్యతతో పూర్తి చేస్తే వారి బిల్లుల ను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకో వాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రణాళిక బద్దంగా పని చేసి ఇళ్ల పనులను పూర్తి చేయాల న్నారు.