పొచ్చెర జలపాతంలో దూకి వృద్ద దంపతుల ఆత్మహత్య

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌21 (జనంసాక్షి) : బోథ్‌ మండలం పొచ్చెర జలపాతం వద్ద విషాదం నెలకొంది. పొచ్చెర జలపాతంలోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. పరిస్థితిని సవిూక్షించారు. భార్య మృతదేహం లభ్యం కాగా, భర్త మృతదేహం కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. మృతులను నేరడిగొండకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దంపతుల ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.