పోరుబాట వీడం

– సమ్మెను ఉధృతం చేస్తాం
– ఆర్టీసీ జేఏసీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి
హైదరాబాద్‌,అక్టోబర్‌ 6(జనంసాక్షి): సుమారు 50వేల మంది కార్మికులు పూర్తిస్థాయిలో పాల్గొంటుంటే సమ్మె పాక్షికమే అంటూ కొన్ని విూడియా సంస్థలు వక్రీకరించడం సరికాదని ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె పై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలిశామని.. వారంతా తమకు మద్దతు ప్రకటించారని చెప్పారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. తాను కొందరు ఉద్యోగులను విమర్శించానంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంలో ప్రమత్వం తీరును అన్ని ఉద్యోగ సంఘాలు ఖండించాల్సిందిగా కోరుతున్నామన్నారు. – నిన్న ఇవాళ ఎన్ని కి.విూ మేర బస్సులు నడిపారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా అధికారులు సీఎం కేసీఆర్‌ కు వాస్తవ పరిస్థితిని వివరించాలన్నారు. రెండో రోజూ ఆర్టీసీ సమ్మె విజయవంతమైందని అన్నారు. సోమవారం ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ లో చేపట్టనున్న నిరాహార దీక్షలో 16 మంది జేఏసీ సభ్యులు పాల్గొంటారని ఆశ్వత్థామ రెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వలేదని, వేతనాలు వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఏ ఉద్యోగ సంఘాలను విమర్శించేదిలేదన్న ఆశ్వత్థామ రెడ్డి..సమ్మెకు మద్దతు తెలిపిన ఉద్యోగ సంఘాల నేతలకు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆర్టీసీని కాపాడేవిధంగా ఉద్యోగ సంఘాలు కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్‌కు వాస్తవ పరిస్థితులను వివరించాలని కోరారు. వివిధ రాజకీయ పక్షాలను కలిసి మద్దతు కోరామని ఆయన వెల్లడించారు.
ఆర్టీసీకి ప్రత్యామ్నాయం లేదు : రాజిరెడ్డి
ప్రజా రవాణాను కాపాడుకోవడానికే సమ్మె చేస్తున్నామని జేఏసీ నేత రాజిరెడ్డి తెలిపారు. ఆర్టీసీకి ప్రత్యామ్నాయం ఏదీ లేదని.. ఇది పెట్టుబడిదారుల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అని ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతుందని విమర్శించారు. అద్దె బస్సులను కొత్తగా వేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు.