పోలవరం ఎత్తిపోతలపై సమీక్షించిన కేసీఆర్

మహబూబ్‌నగర్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు. నల్లగొండ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ కరివెనలో పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ఎంపీ జితేందర్‌రెడ్డికి చెందిన ఫామ్‌హౌజ్‌లో లంచ్ చేశారు. తర్వాత పాలమూరు ఎత్తిపోతలపై స్పష్టత కోసం అధికారులతో సమీక్ష జరిపారు.