పోలీసులమంటూ బెదిరించి.

 రంగారెడ్డి : ఈజీ మనీకి అలవాటుపడ్డ యువకులు కొందరు ఏకంగా పోలీసుల అవతారమెత్తారు. వచ్చీపోయే వాహనదారులను బెదిరించి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టారు. పాపం పండి చివరకు పోలీసులకు చిక్కారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో ఆరుగురు యవకులు పోలీసులమంటూ ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు నటించి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. ఈ విషయం కాస్త అసలు పోలీసులకు తెలియడంతో చివరకు నకిలీ పోలీసులు దొరికిపోయారు. వారి దగ్గర నుంచి రూ. 65 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏదో ఒక విధంగా డబ్బులు సంపాదించాలనే వారి దురాశ చివరకు వారిని కటకటాలపాలు చేసింది.