పోలీసుల అదుపులో రేవంత్..

86mn455nమహబూబ్ నగర్ : టిటిడిపి ఎమ్మెల్యే, ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న రేవంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనితో కొడంగల్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మంత్రి జూపల్లి ప్రారంభం చేయనున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవమే ఇందుకు కారణం. గురువారం మంత్రి జూపల్లి ప్రారంభించనున్న మార్కెట్ యార్డు ప్రారంభోత్సవానికి తనకు ఆహ్వానం రాలేదని రేవంత్ పేర్కొంటూ భారీగా అనుచరులతో ర్యాలీగా యార్డుకు బయలుదేరారు. ముందే పసిగట్టిన పోలీసులు రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు. దీనితో కార్యకర్తలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేశారు. అనంతరం రేవంత్ ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. ఆగ్రహంలో ఉన్న రేవంత్ అనుచరులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. దీనితో కొడంగల్ నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్తితులు తలెత్తాయి.