పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: నాయిని

నిజామాబాద్, ఆగస్టు 31: పోలీసు రిక్రూట్‌మెంట్‌లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హోంమంత్రి నాయిని నరసింహరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన సదాశివనగర్‌లో రూ.67 లక్షలతో నిర్మించిన పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌లో పోలీసు కమాండెంట్‌ కంట్రోల్‌ భవనాన్ని నిర్మిస్తామని తెలిపారు. పోలీసుల ప్రజల మద్య సత్సంబంధాలను మెరుగుపర్చుతామని నాయిని తెలిపారు.