పోలీస్‌ కమిషనర్లుగా ఐదుగురు చిన్నారులు

బెంగళూరు,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బెంగళూరు సిటీలో ఐదుగురు చిన్నారులు పోలీస్‌ కమిషనర్లుగా నియమించబడ్డారు.  ప్రాణాంతక వ్యాధితో భాదపడుతున్న ఐదుగురు (5-11 సంవత్సరాలు)చిన్నారులను బెంగళూరు సిటీ పోలీస్‌, మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ వారి కోరిక మేరకు ఐదుగురు చిన్నారులను ఒక రోజు పోలీసు ఆఫీసర్లుగా నియమించి వారి కోరిక తీర్చారు. ఆ సందర్భంలో చిన్నారుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయని మేక్‌ ఏ విష్‌ ఫౌండేషన్‌ వారు అన్నారు. చిన్నారులకు ఈ అరుదైన అవకాశమిచ్చిన పోలీసు శాఖ వారికి ఈ సందర్భంగా ఫౌండేషన్‌ వారు ధన్యవాదాలు తెలిపారు.