ప్రకృతి వ్యవసాయంపై నేడు శిబిరం

ఖమ్మం,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): ఆదివారం ఖమ్మంలో  ఉచిత ప్రకృతి వ్యవసాయ శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఏకలవ్య ఫౌండేషన్‌ ప్రకటించింది. శ్రీశ్రీ రవిశంకర్‌ గురూజీ స్ఫూర్తితో ఐఎల్‌టీపీ, ఏకలవ్య ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో దీనిని నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఏకలవ్య ఫౌండేషన్‌ జిల్లా అధ్యక్షుడు చైతన్య కిషోర్‌ పేర్కొన్నారు.  ఆదర్శ ప్రకృతి రైతులు ఈ శిక్షణకు హాజరుకానున్నారని తెలిపారు. రైతులకు, వినియోగదారులకు విష రసాయనాలు లేని ఆహారాన్ని అందించే ఈ కార్యక్రమాన్ని తలపెట్టినట్లు తెలిపారు. ఈ శిబిరానికి ఆత్మ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ మణిమాల ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఈ శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.