ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ వాహన పూజ

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):   విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వాహన , ఆయుధ పూజలు నిర్వహించారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సీఎం దసరా శుభాకాంక్షలు తెలిపారు. పూజా కార్యక్రమంలో సీఎం సతీమణి శోభ, కుమారుడు కేటీఆర్‌, కోడలు శైలిమ, మనుమడు హిమాన్షు, కుమార్తె కవిత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.