ప్రగతి నివేదన సభకు ట్రాక్టర్లలో పయనం

జెండా ఊపిన మంత్రి ఈటెల

హుజూరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నం సాక్షి ): ఆదివారం జరగబోయే ప్రగతి నివేదన సభ కోసం సర్వం సిద్ధమయింది. రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలంతా సభకు బయలు దేరారు. శుక్రవారం నుంచే చాలా మంది ర్యాలీగా సభకు వెళ్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచే 2000 ట్రాక్టర్లు సభకు బయలుదేరాయి. ఇవాళ హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్‌ సమక్షంలో ట్రాక్టర్లలో ప్రగతి నివేదన సభకు ప్రజలు బయలుదేరారు. ఈ సందర్భంగా ట్రాక్టర్‌ ర్యాలీని మంత్రి ప్రారంభించారు.