ప్రచారంలో జానాను నిలదీసిన ప్రజలు

అసహనం వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ నేత

నాగార్జునసాగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డికి నిరసన సెగ తగిలింది. నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆయనను అక్కడి అభివృద్ధి పనులపై కొందరు స్థానికులు ప్రశ్నించారు. దీంతో జానారెడ్డి వారిపై అసహనం వ్యక్తంచేశారు. ఇష్టం ఉంటే కాంగ్రెస్‌కు ఓటేయండి.. లేదా వెళ్లిపోవాలన్నారు. తాను చేసిన అభివృద్ధి నచ్చితే తనకు ఓటు వేయాలని,

లేకపోతే నచ్చిన వాళ్లకు ఓటేయండి అని చెప్పారు. దీంతో అక్కడే ఉన్న కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రశ్నించిన వాళ్లను సముదాయించారు. అనంతరం జానారెడ్డి తన ప్రచారాన్ని యథావిథిగా కొనసాగించారు.