ప్రచారంలో జోరు పెంచిన బిజెపి
2న కరీంనగర్ రానున్న యూపి సిఎం యోగి
కరీంనగర్,నవంబర్ 28(జనంసాక్షి): ఎన్నికల ప్రచారంలో బిజెపి ప్రముఖులు ఒక్కొక్కరే రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్షా, కేంద్రమంత్రులు సుడిగాలి పర్యటన చేశారు. ప్రచారంలో జోరు పెంచిన బిజెపి మరికొందరు ప్రముఖులను రంగంలోకి దింపుతోంది. ఈ కోవలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కూడా తెలంగాణ ప్రచారంలోకి రానున్నారు. డిసెంబర్ 2న ఎన్నికల
ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి వస్తున్నట్లు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, బహిరంగ సభ ఇన్చార్జి కొట్టె మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక సర్కస్గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో బీజేపీ కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గెలుపు కోసం ఆయన ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. యోగితో పాటు ఈ సభకు బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని అన్నారు. బీజేపీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు, యువకులు, మహిళలు, వ్యాపార, వాణిజ్య, అన్నివర్గాల ప్రజలుపాల్గొని విజయవంతం చేయాలని కోరారు.