ప్రచారంలో తెల్లం ముందంజ

మారుమూల గ్రామాల్లోనూ చుట్టివస్తున్న టిఆర్‌ఎస్‌ అభ్యర్థి

భద్రాచలం,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ నాలుగున్నరేళ్ల పాలనలో చేపట్టి అమలుచేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ డాక్టర్‌ తెల్లం వెంకట్రావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాలినడకన విస్తృత పర్యటన నిర్వహించారు. అభివృద్ధిని చూసి ప్రజలందరూ కేసీఆర్‌ సర్కార్‌వైపే మొగ్గు చూపుతున్నారని భద్రాచలం అభ్యర్థి డాక్టర్‌ తెల్లం వెంకట్రావును అన్నారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని విన్నవించారు. భద్రాచలం నియోజకవర్గాన్ని గెలిపించి అభివృదద్దికరి ఓటేయాలని డాక్టర్‌ తెల్లం వెంకట్రావు కోరారు. ఈ మేరకు ఆయన పలు గ్రామాల్లో వ్యక్తిగతంగా అందరిని కలసి ఓట్కలు అభ్యర్థిస్తున్నారు. భద్రాచలం గెలుపును సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇస్తామని అన్నారు. ప్రచారం నిమిత్తం వెళ్లిన వెంకట్రావుకు పార్టీ మండల నాయకులు, గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ పథకాలు బాగున్నాయని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని హావిూ ఇచ్చారు. మారుమూల గ్రామాల పర్యటనకు వచ్చిన డాక్టర్‌ తెల్లం వెంకట్రావు సమక్షంలో వివిధ పార్టీల వారు టీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ప్రతి కుటుంబానికి అవసరమైన అన్ని పథకాలను ప్రవేశపెట్టి అమలుచేస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. తాజాగా రైతులకు రైతుబీమాను ప్రవేశపెట్టి ఒకవేళ రైతు ఏ కారణం చేతైనా మరణిస్తే ఆ రైతు కుటుంబానికి నామినీగా ఉన్న వ్యక్తి ఖాతాల్లోకి మరణించిన మూడు రోజుల్లోనే రూ.5లక్షల బీమాను అందిస్తున్న ఘనత కూడా ఆయనకే దక్కుతుందన్నారు. అదేవిధంగా ఆయా గ్రామాల్లోని పెద్దలను కలుసుకోవడంతో ఈసారి భద్రాచలం నియోజకవర్గ సీటు మెజార్టీతో విజయం సాధిస్తానని చెప్పారు.