ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

టిఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటా ప్రచారం

దండేపల్లి, నవంబర్‌ 11, (జనంసాక్షి) :

దండేపల్లి మండలం మేదరిపేటలో ఆదివారం దండేపల్లి మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు చేసిన అభివృద్ధి విషయాల గురించి ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా దివాకర్‌రావును గెలిపించాలని కోరారు. ఈ కార్యకమ్రంలో మాదాపూర్‌ మాజీ సర్పంచ్‌ చీకటి జ్యోతి, నాయకులు మోటపలుకుల గురవయ్య, బండారు మల్లేష్‌, సత్యంరావు, వెంగళ్‌రావు, చొప్పదండి రమేష్‌, నక్క తిరుపతి, ఇప్ప రమేష్‌, నక్క గంగన్న, పిట్టల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.