ప్రజాసమస్యలపై పోరాడుతాం

నిజామబాద్‌,మార్చి2 (జ‌నంసాక్షి): పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి తాము ఎంతో కృషిచేస్తామని, సమస్యలపై పోరాడుతామని సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమయ్య అన్నారు. ప్రభుత్వాలు ప్రజలకు వ్యతిరేకంగా విధానాలు రూపొందిస్తూ వారి జీవితాలతో ఆడుకుంటున్నాయని, వాటిపై ఉద్యమించేందుకు తాము వెనుకడుగు వేయమని ఆయన పేర్కొన్నారు. రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ముఖ్యంగా జిల్లాలో రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు తీర్మానాలు చేశామన్నారు.