ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

కమాన్ పూర్ , జనం సాక్షి : బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ఈ నెల 5వ తేదీ నుండి మంథని నియోజకవర్గంలో చేపట్టనున్న ప్రజా చైతన్య యాత్ర వాల్ పోస్టర్ ను గురువారం పెద్దపెల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో మండల బిజెపి నాయకులు ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. మంథని ప్రజలను చైతన్య పరచడమే ప్రజా చైతన్య యాత్ర అని ఈ యాత్ర మొదట మంథని నియోజకవర్గంలోని తూర్పు డివిజన్ పరిధిలోని ఐదు మండలాలలో చెప్పటం జరుగుతుందని తెలిపారు. మంథని అభివృద్ధిని అడ్డుకుంటున్న రాజకీయ నాయకులకు కనువిప్పు కలిగెలగా ఈ యాత్ర ఉంటుందని అన్నారు. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీని మంథని నియోజకవర్గంలో బలోపేతం చేసి, మంథని నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు జంగంపల్లి అజయ్ సీనియర్ నాయకులు మచ్చ గిరి రాము, మల్లారపు అరుణ్ కుమార్ , కొయ్యడ సతీష్, కొమ్ము శ్రీనివాస్, మట్ట రాజయ్య తదితరులు పాల్గొన్నారు.