ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుంది : కోదండరాం

మంచిర్యాల : ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై స్పందించిన ఆయన జేఏసీలో చర్చించిన తర్వాత సమాధానం చెబుతామని అన్నారు. జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశం తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం అదిలాబాద్‌ జిల్లాలోని మంచిర్యాలలో పర్యటిస్తున్న ఆయన ఏబీఎన్‌తో మాట్లాడుతూ మంత్రుల వ్యాఖ్యలపై రేపు (బుధవారం) జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమై చర్చలు జరిపిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ స్పందన తెలియజేస్తామని అన్నారు. ఎవరు ఏమన్నాసరే ప్రస్తుతం వ్యక్తిగతంగా మాట్లాడలేనని, కమిటీ సభ్యులు అందరం చర్చించిన తర్వాతే నిర్ణయం తెలియజేస్తామని ఆయన చెప్పారు. కార్యచరణకు సంబంధించి ప్రాధాన్యత అంశాలను గుర్తించామని దానికి తగినట్టుగా ఒక్కొక్క కార్యక్రమాలు చేస్తున్నామని కోదండరాం తెలిపారు.Kodandaram