ప్రతి గడపకూ టిఆర్‌ఎస్‌ పథకాల ప్రచారం సాగాలి: జలగం

కొత్తగూడెం,జూలై19(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడూ వచ్చినా టీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపు అని కొత్తగూడెంఎమ్మెల్యే జలగం వెంకటరావు అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపు టీఆర్‌ఎస్‌దే అని, ఆ దిశగా ప్రతి కార్యకర్త పనిచేయాలని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ తెలియ జెప్పాలని, ఆ విధంగా బూత్‌ లెవల్‌ కమిటీలు, విలేజ్‌ లెవల్‌ కమిటీ ఓటర్‌ లిస్టుల ఆధారంగా ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చెసుకుని దాని ప్రకారం ఒక ప్రణాళికా ప్రకారం ముందుకు సాగాలని అన్నారు. ప్రతి కార్యకర్త బాగా కష్టపడి టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాను వచ్చే ఎన్నికల్లో రెపరెలాడించాలని అన్నారు. ప్రతి కార్యకర్త కూడా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృధ్దిని, గత అభివృద్దిని ప్రజలకు తెలియజెప్పడానికి రోజులో 2,3 గంటలు కేటాయిచి గ్రామంలొ తిరిగి ప్రచారం చేయాలని, తద్వారా ఓటర్లలో నవ చైతన్యం తీసుకు రావాలని ఉద్బోధిచారు. ఎన్నికల వేల సవిూపిస్తున్న తరుణంలో కొన్ని శక్తులు కుయుక్తులను పన్నుతాయని వాటిని సమయానుకూలంగా తిప్పికొట్టాలని అన్నారు. గత ప్రభుత్వాలపాలనలో ఏళ్ళపాటు సాధ్యంకాని అభివృద్ధిని, తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలోనే ప్రజలకు అందించిందని తెలిపారు. ప్రభుత్వపథకాల ద్వారా ఒక కుటుంబం ఏదోవిధంగా ప్రభుత్వ ఫలాలు పొందుతున్నారని, వారికి వాటి గురించి తెలిపాలని సూచించారు.

—-