ప్రతి జిల్లాలో కార్పొరేట్ ఆస్పత్రి : లక్ష్మారెడ్డి

మెదక్ : ములుగు మండలం మార్కుక్‌లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మండల కేంద్రాల్లోని ఆస్పత్రులను 30 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని వెల్లడించారు. 30 పడకల ఆస్పత్రులను 100 పడకల ఆస్పత్రులుగా మారుస్తామని ప్రకటించారు. ప్రతి జిల్లాలో అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ ఆస్పత్రిని నిర్మిస్తామని హామీనిచ్చారు.