ప్రధానితో సచిన్‌ భేటీ

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వచ్చే వారం తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా వివరాలను ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమాలో సచిన్‌ తన పాత్రలో తానే నటించడం విశేషం. ఇక ప్రధానిని కలుసుకున్న అనంతరం సచిన్‌ ట్విటర్‌ లో స్పందించాడు. ప్రధాని నరేంద్ర మోఢీకి ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా గురించి వివరించానని వెల్లడించాడు.