ప్రధాని మోడీ పర్యటన ఖరారు

న్యూఢిల్లీ,జూలై21(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటించే దేశాలకు సంబంధించిన వివరాలు ఖరారయ్యాయి. సౌత్‌ ఆఫ్రికాలో ఈ 25 నుంచి 27 వరకు బ్రిక్స్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి అంతర్జాతీయ శాంతి, రక్షణ అంశాలపై చర్చ జరిగనుంది. అంతకుముందు ప్రధాని మోడీ రువాండా, ఉగాండాలో పర్యటించనున్నారు. జూలై 23 నుంచి 27 వరకు ప్రధాని మోడీ మూడు దేశాల్లో పర్యటిస్తారు. మొదట రువాండాలో రెండ్రోజుల పాటు పర్యటిస్తారు. తర్వాత జూలై 24న ఉగాండాకు బయల్దేరి వెళ్లి, అక్కడి నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తారు. అటు బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భేటీ కానున్నట్లు చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇరువురు నేతలు వాణిజ్యంలో అమెరికా వైఖరి సహా ఉమ్మడి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను చర్చించే అవకాశం ఉంది.

—————-