ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా విజృంభణ

` అమెరికాలో 10క్షు దాటిన మహమ్మారి బాధితుల‌ సంఖ్య

న్యూయార్క్‌,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో యూఎస్‌ఏలో కరోనాతో 1,303 మంది మృతి చెందినట్లు జాన్స్‌ హాఫ్‌కిన్స్‌ యూనివర్సిటీ వ్లెడిరచింది. ఇప్పటి వరకు అమెరికాలో కరోనాతో 56,797 మంది ప్రాణాు కోల్పోయారు. 1,38,990 మంది ఈ వైరస్‌ నుంచి కోుకుని డిశ్చార్జి అయ్యారు. అమెరికా వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసు సంఖ్య 10,10,356కు చేరింది. న్యూయార్క్‌లో 22,623 మంది, న్యూజెర్సీలో 6,044, మాసాచ్చుసెట్స్‌లో 3,003, ఇల్లినాయిస్‌లో 1,983, కాలిఫోర్నియాలో 1,776, పెన్నిసిల్వానియాలో 1,860, మిచిగాన్‌లో 3,407, ఫ్లోరిడాలో 1,088 మంది కరోనాతో చనిపోయారు. రష్యాలో కరోనా వైరస్‌ బాధితు సంఖ్య క్షకు చేరువలో ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 6,411 పాజిటివ్‌ కేసు నమోదవడంతో మొత్తం కేసు సంఖ్య 93,558కు చేరింది. ఒకరోజులో గరిష్టంగా కేసు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు 867మంది కరోనా వ్ల చనిపోయారు. గత వారం రోజు నుంచి ప్రతిరోజు సగటున ఆరువే కేసు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ఎక్కువగా కరోనా బాధితున్న దేశా జాబితాలో  రష్యా ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ వారంలోనే కేసు సంఖ్యలో చైనా, ఇరాన్‌ను రష్యా దాటేసింది. రష్యా సైన్యంలో ఇప్పటి వరకు 874 మంది సిబ్బందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కారణంగా ప్రాణాు కోల్పోయిన బాధితుకు బ్రిటన్‌  నివాళు అర్పించింది. కరోనా మహమ్మారిపై పోరాటంలో మృతిచెందిన వారి సేవను  రాజకీయ నాయకు, దేశప్రజు  స్మరించుకున్నారు. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌తో పాటు దేశపౌరుందరూ నిమిషం పాటు మౌనం వహించారు.  మంగళవారం ఉదయం 11 గంటకు డాక్టర్లు, నర్సు తమ విధును పక్కనపెట్టి ప్రతిఒక్కరూ రెండు విూటర్ల భౌతిక దూరం పాటిస్తూ మౌనం పాటించారు. కరోనా నుంచి కోుకున్న ప్రధాని బోరిస్‌ వరుసగా రెండో రోజు కూడా విధుకు హాజరయ్యారు. కేబినెట్‌ టేబుల్‌ దగ్గర సహచర మంత్రు, అధికారుతో కలిసి ఆయన నివాళి అర్పించారు. వైరస్‌ వ్ల సుమారు 100 మంది ఎన్‌హెచ్‌ఎస్‌, కేర్‌స్టాఫ్‌ సిబ్బంది మరణించారు. యూకేలో 157,149 మందికి వైరస్‌ సోకింది. ఇప్పటి వరకు 21,092 మంది చనిపోయారు.

 

భారత్‌లో 24 గంటల్లో 1543 కొత్త కేసులు

దిల్లీ,ఏప్రిల్‌ 28(జనంసాక్షి) గడచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 1543 కరోనా కేసు నమోదుకాగా, 684 మంది కోుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి వ్‌ అగర్వాల్‌ తెలిపారు. దీంతో భారత్‌లో మొత్తం కరోనా కేసు సంఖ్య 29,435కు చేరుకుందని తెలిపారు. వీరిలో 6,869 మంది కోుకున్నట్లు వ్లెడిరచారు. ప్రస్తుతం కరోనా రోగు రికవరీ రేటు 23.3 శాతంగా ఉందని పేర్కొన్నారు. గత 28 రోజుల్లో 17 జిల్లాల్లో కొత్త కేసు  నమోదు కాలేదని, రోజు రోజుకి కోుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుందని ఆయన వ్లెడిరచారు. దేశంలో ప్లాస్మా థెరపీ ఇంకా ప్రయోగదశలోనే ఉందని, దాని వ్ల వైరస్‌ తగ్గుముఖం పడుతుందనడానికి ఎటువంటి ఆధారాు లేవని స్పష్టం చేశారు. ఐసీఎంఆర్‌ అధ్యయనం తర్వాత, పూర్తి స్థాయిలో శాస్త్రీయ ఆధారాు భించేంత వరకు ప్లాస్మా థెరపీని ప్రయోగాకు, పరిశోధనకే పరిమితం చేస్తామని వ్లెడిరచారు.  ప్లాస్మా థెరపీని సరైన పద్ధతిలో, మార్గదర్శకాు లేకుండా ప్రయోగిస్తే రోగి ప్రాణాకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు.  దీనిని రోగుకు ఉపయోగించేందుకు అనుమతించే వరకు ఎవ్వరూ ఈ థెరపీని ఉపయోగించకూడదని, అది ప్రమాదకరం, చట్ట విరుద్ధం అని హెచ్చరించారు.

 

ఏపీలో మరో 82 పాజిటివ్‌ కేసులు

అమరావతి,ఏప్రిల్‌ 28(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ వియతాండవం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 5,783 మంది శాంపిల్స్‌ పరీక్షించగా 82 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసు సంఖ్య 1259కి చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. 258 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్సపొంది కోుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం కొవిడ్‌ ఆసుపత్రుల్లో 970 మంది చికిత్స పొందుతున్నారు. ఇవాళ నమోదైన కేసుల్లో అత్యధికంగా 40 కర్నూు జిల్లాలోనే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ రాజ్‌భవన్‌లో నుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. అందులో సెక్యూరిటీ సిబ్బంది, స్టాఫ్‌ నర్సు, ఇద్దరు అటెండర్లు ఉన్నారని పేర్కొన్నారు. గవర్నర్‌కు కరోనా పరీక్షు చేస్తే నెగెటివ్‌ వచ్చిందన్నారు.  ఈ నుగురికి తప్ప..రాజ్‌భవన్‌లో ఎవరికీ కరోనా సోకలేదని  చెప్పారు. ’గవర్నర్‌తో సహా అందరికీ టెస్టు నిర్వహించాం.  ఏపీలో 31 మంది వైద్య సిబ్బందికి  కరోనా సోకింది. పాజిటివ్‌గా తేలినవారిలో 12 మంది డాక్టర్లు, 12 మంది నర్సు ఉన్నారు. రాజ్‌భవన్‌లో అందరికీ పరీక్షు చేస్తున్నామని’ వైద్య ఆరోగ్యశాఖ వివరించింది.