ప్రభుత్వ కళాశాలలో విఆర్ఒ పోస్డులకు ఉచిత కోచింగ్ 

భీమ్‌గల్‌, జూన్ 7 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విఆర్ఒ పోస్టులకు భీమ్‌గల్‌ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. చిరంజీవి గురువారం ఒక ప్రకటనలో తెల్పారు. ప్రభుత్వ కళాశాలలో చదివిన ఎవరైనా విద్యార్థులు తమ మెమో, బోనఫైడ్ జిరాక్స్ లు తీసుకుని తమ పేర్లు కోచింగ్ సెంటర్లో నమోదు చేసుకోవాలని తెల్పారు. ఈ అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పదవ తరగతి పాస్ అయిన విద్యార్థులు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరాలని ఆయన కోరారు. అనంతరం హైదరాబాద్ లోని నిజాం కళాశాలలో సీటు సాధించిన శివరాత్రి రాజేంధర్ కు శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.