ప్రభుత్వ స్కూళ్లనే ఆశ్రయించండి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,జూలై22(జ‌నంసాక్షి): గ్రావిూణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని, ప్రభుత్వం పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తోందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు.  మరుగుదొడ్లు, తాగునీటి, వంటశాలతోపాటు పాఠశాల పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించి తల్లిదండ్రులు ఆర్థికంగా నష్టపోవద్దన్నారు. నిరుపేద ప్రజలు ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి హావిూ పనులను సద్వినియోగం చేసుకోవాలని జోగురామన్న అన్నారు.  గ్రామాల్లో ఉపాధి హావిూ పనులను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. గ్రావిూణ ప్రాంతాల్లో చాలా మంది ఉపాధి హావిూ పనుల్లో ఎలాంటి పనులు ఉన్నాయో తెలియక పనులు చేసే అవకాశం కోల్పోతున్నారని అన్నారు. ఉపాధి ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇకపై పనులు చేయబోయే ముందు రోజు సంబంధిత గ్రామాల్లో తప్పని సరిగా సమావేశాలు నిర్వహించాలన్నారు. కూలీలకు ఎప్పటికప్పుడు డబ్బులు వచ్చేలా చూడాలని ఆదేశించారు. హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఆయన రామన్న అన్నారు. వివిధ శాఖల అధికారులకు కేటాయించిన మొక్కలన్నింటినీ గడువులోగా నాటించాలన్నారు. పలుచోట్ల నాటిన మొక్కలు మొలకెత్తక పోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.