ప్రమాదస్థాయిలో ప్రవహిస్తున్న మూసీ నది

Musi River_2_0_0రంగారెడ్డి: వరుసగా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉప్పొంగి ప్రమాద స్థాయిలో ప్రవహిస్తుంది. పలు ప్రాంతాలు నీట మునిగాయి. శంకరపల్లి-చేవెళ్ల మధ్య రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదేవిధంగా పెద్దేముల్ మండలంలో గల కందనవెల్లి వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో తాండూరు-వికారాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.