ప్రాదేశికం ఎన్నికల్లో సత్తాచాటుదాం

– టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకు కార్యకర్తలు కృషి చేయాలి
– అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించండి
– ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌
మహబూబ్‌నగర్‌, మే3(జ‌నంసాక్షి) :  ప్రాదేశిక ఎన్నికల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలను కైవసం చేసుకొని టీఆర్‌ఎస్‌ సత్తా చాటుదామని రాష్ట్ర ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలోని జమిస్తాపూర్‌ గ్రామంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జడ్పీటీసీ అభ్యర్థి వెంకటేశ్వర్మ, ఎంపీటీసీ అభ్యర్థి నాగరాజులను కారు గుర్తుపై ఓటేవేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలితంగా వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయించి బీడు భూ ములను సాగులోకి తెచ్చారన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పూర్తయితే జిల్లా సస్యశ్యామలంగా మారుతుందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేని ప్రతిపక్షాలు ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని, వాటన్నింటిని సమర్థవంతంగా ఎదుర్కొని ప్రా జెక్టుల పనులను వేగవం తం చేస్తున్నామన్నారు. అవసరమైన ప్రాంతాల్లో ప్రాజెక్టులను నిర్మించి బీ డు భూములను సాగులోకి తెస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమపథకాలు దేశానికే రోల్‌మోడల్‌గా మారాయని అన్నారు.  నిరుపేదల కళ్లల్లో ఆనందం చూడటమే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. పోరాటాలు, త్యాగాల పునాదుల విూద ఏర్పడ్డ తెలంగాణ రాష్టాన్న్రి… ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి పథంలోకి తీసుకెళ్లారని చెప్పారు. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్టాన్న్రి సమూలంగా మార్చే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. కేజీ టు పీజీ విద్యలో భాగంగా రెసిడెన్షియల్‌ పాఠశాలలు ఏర్పాటు చేసి నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. మిషన్‌ భగీరథ ఇంటింటికి తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. కేసీఆర్‌ చేపడుతున్న సంక్షేమ పథకాలకు చూసి కారు గుర్తుకు ఓటేసి టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌ గౌడ్‌, జిల్లా మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కాడెం ఆంజనేయులు, మండల టీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు ప్రతాప్‌ రెడ్డి, సావిత్రి, శ్రీదేవి, సరస్వతమ్మ, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు రవీందర్‌ రెడ్డి, మల్లు నర్సింహారెడ్డి, సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ తదితరులు పాల్గొన్నారు.