ప్రియాంకకు యూపీ ప్రచార సారధ్యం…?

636029826157033057న్యూఢిల్లీ : ప్రియంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారా? యూపీలో కాంగ్రెస్‌ విజయం కోసం ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 9 నెలల గడువు ఉంది. అయినా అప్పుడే రాజకీయ వేడి రాజుకుంది. ఎలాగైనా యూపీ కోటలో పాగా వేయాలని కాంగ్రెస్‌, బీజేపీలు వేటికవే అస్త్ర శస్ర్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి.

ఉత్తరప్రదేశ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రియాంక గాంధీని తెరపైకి తేచ్చేందుకు సిద్ధమవుతోంది. కాంగ్రెస్‌ ప్రచార కమిటీ బాధ్యతలను ప్రియాంకకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే అందుకు రంగం సిద్ధం చేసింది. యూపీలో దాదాపు 120 చోట్ల ప్రియాంక ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కొనేందుకు విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఇప్పటివరకు తన తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్‌ నియోజక వర్గాల్లో ప్రచారానికి మాత్రమే ఆమె పరిమితమయ్యారు. కానీ యూపీలో పార్టీ పూర్తి స్థాయి బాధ్యతలు తీసుకునేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నారు.