ప్రియుడి మోసం: యువతి ఆందోళన

నల్గొండ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): ప్రేమించిన వ్యక్తిని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని రామన్నపేట మండలం కొమ్మాయిగూడెంలో ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి బంధువులతో కలిసి ఆందోళనకు దిగింది. ప్రియుడు గణెళిశ్‌, తానూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి చేసుకుంటానని చెప్పాడని యువతి ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకోమని గట్టిగా నిలదీయడంతో ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడని చెబుతున్నారు. అంతేకాదు పెళ్లికి నిరాకరిస్తున్నాడని ఆమె అంటున్నారు. గణెళిశ్‌ మరో పెళ్లి చేసుకోబోతున్నాడని
తెలియడంతో అతని ఇంటి ముందు ధర్నాకు దిగినట్లు యువతి తెలిపారు. న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేదిలేదని ఆమె స్పష్టం చేశారు.